జవహర్నగర్, ఆగస్టు 14: డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విషతుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారుతున్నదని, వెంటనే డంపింగ్యార్డ్ను శాస్త్రీయ పద్ధతిలో యుద్ధప్రతిపాదికన ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ ఉమామహేశ్ అన్నారు. రాంకీ చెత్త డంపింగ్యార్డ్ను శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ.. షేక్షావలి, కన్వీనర్ ఉమామహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్నగర్ మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ డంపింగ్యార్డ్ ప్రభావిత ప్రాంతంలో కలుషిత జలాలతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నదని, మృత్యుకూపాలుగా మారిన చెరువులన్నీ శుద్ధి చేయాలన్నారు. కాగా, డంపింగ్యార్డ్ పోరాట కమిటీకి వెన్నంటి ఉంటామని మాజీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు శాంతి, శ్రీనివాస్, లలితాయాదవ్, సంగీతారాజశేఖర్, వేణు, రవి, బాబు, శ్రీనివాస్, వెంకటేశ్, సతీష్, సాయి, నవీన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, రాజ్కుమార్, రామ్చందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.