HomeWarangal-ruralMla Aruri Ramesh Has Called For Telangana State Decade Celebrations To Be Held In A Festive Atmosphere
దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు నిచ్చారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక సమీ క్షా సమావేశం నిర్వహించారు.
21 రోజుల పాటు నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు
బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు భాగస్వాములవ్వాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష
ఐనవోలు, మే 25 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు నిచ్చారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకుని పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 21 రోజలు పా లు నియోవర్గ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తు న్న భాగస్వాములను చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, ఎంపీడీవో వెంకటరమణ, తహసీల్దార్ రాజేశ్, సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మ న్ శ్రీరాములు, ఎంపీపీ మధుమతి, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ మోహన్, ఆలయ కమిటీ చైర్మన్ జయపాల్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సంపత్కుమార్, సర్పంచ్ కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన, ఉప సర్పంచ్ సతీశ్, మండల పార్టీ నాయకులు రాజశేఖర్, రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలువాలి
బ్యూటిషన్ ఉచిత శిక్షణు సద్వినియోగం చేసుకొని కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలువాలి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ తెలంగాణకు సాగు, తాగు నీరు వచ్చిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారిందన్నారు.
మన నియోజవర్గంలోని మహిళలకు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే మన ని యోజవర్గంలో ప్రతి మండల కేంద్రంలో ఒక ఉచిత బ్యూటిషన్ ట్రైనింగ్ సెంటర్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన గుర్తుజేశారు. దీనిలో భాగంగానే నియోజవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలో పూర్తి చేసుకొని ఇప్పుడు ఐనవోలు మండల కేంద్రం ప్రారంభం చేసుకున్న విషయం గుర్తుజేశారు. ఈ ఉచిత ట్రైనింగ్ను ఆసక్తిగల వారు సద్వినియోగం చేసుకొని వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలువాని కోరారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ముందకు వెళ్లి వారికి బ్యాంకుల ద్వారా కూడా షాపు ఏర్పాటు కూడా కృషి చేస్తాన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం అనేక సం క్షేమ పథకాలు తీసుకవచ్చిన విషయం గుర్తుజేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శ..
బాధిత కుటుంబ సభ్యులను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి వజ్రమ్మ, కక్కిరాలపల్లికి చెందిన అరూరి లక్ష్మి, పైండ్ల రాజు, రాంనగర్కు చెందిన ఆకులపెల్లి ప్రమీల, నందనంలో కన్నా శ్రీజలు ఇటీవల మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్ మృతుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ప రామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.