కరీమాబాద్, ఫిబ్రవరి 2 : బీజేపీ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. మామునూరుకు చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్కు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో అతడికి మంజూరైన రూ.60 వేల చెక్కును ఎమ్మెల్యే అరూరి అతడి ఇంటికి వెళ్లి గురువారం అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. స్వయంగా ఇంటికి వచ్చి చెక్కును అందజేసినందుకు బీజేపీ నాయకుడు హర్షం వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.