మరిపెడ, జనవరి 20 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాల నాయకులు కంటి వెలుగు శిబిరాల్లో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని ప్రగతి పనులను చూడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హితవు పలికారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని అర్అండ్బీ అతిథి గృహంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తమ రాజకీయ ఉనికి కోసం సీఎం కేసీఆర్పై అసత్యపు అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్రెడ్డి రాష్ట్ర విభజన అంశాలు, రాష్ట్ర ప్రగతిపై ఏనాడైనా స్పం దించారా..?, కేంద్రం పెద్దలను నిలదీశారా అని ప్రశ్నించారు. దేశ సమగ్రాభివృద్ధిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు స్పష్టమైన ప్రణాళిక ఉందని, అదే విజన్తో ముందుకెళ్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాంతీయ పార్టీని స్థాపించిన కేసీఆర్ రాష్ర్టాన్ని సా ధించి, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపినట్లు తెలిపారు. ప్రాజెక్టులు నిర్మించి సాగు రంగానికి జీవం పోశారని, కుల వృత్తిదారులకు పల్లెల్లోనే ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన జాతీయ పార్టీలు పేదలకు చేసింది శూన్యమన్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించగల సామర్థ్యం సీఎం కేసీఆర్లో మెండుగా ఉందని, అంద రం ఆయనకు మద్దతు పలకాలన్నారు. ఆయా రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, జాతీయ నాయకులు సైతం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు చేసి, మెరుగైన చూపును అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
తన హయాంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల రావడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ ఈన్ఎసీ గణపతిరెడ్డికి ఫోన్ చేసి ఆదేశించారు. మున్సిపల్ కేంద్రం నుంచి మైనార్టీ కాలనీ వరకు సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని 461 జీపీలకు సీఎం కేసీఆర్ రూ.10లక్షల చొప్పున రూ.46.10కోట్లు, మున్సిపల్ కేంద్రాల అభివృద్ధికి రూ.125 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొంపె ల్లి శ్రీనివాస్రెడ్డి, పానుగోత్ రాంలాల్, ఆయూబ్ పాషా, గంథసిరి అంబరీష, కొంపె ల్లి సురేందర్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అబ్బయ్య, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో కేలోత్ ధన్సింగ్, పాదూరి శ్రావణ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి పునఃప్రతిష్ఠకు మంత్రి విరాళం
మహబూబాబాద్, జనవరి 20 : మహబూబాబాద్ పట్టణంలో వచ్చే నెల ఒకటి నుంచి 5 వరకు నిర్వహించనున్న బొడ్రాయి పునఃప్రతిష్ఠ ఉత్సవాలకు మంత్రి సత్యవతిరాథోడ్ రూ.2లక్షల విరాళం కమిటీ బాధ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రజల మేలు కోసం బొడ్రాయి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహబూబాబాద్ ఎస్పీగా పనిచేసిన నంద్యాల కోటిరెడ్డి ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారని, ఆయన తండ్రి మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రునాయక్ మాతృమూర్తి దశ దిన కర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట రాష్ట్ర నాయకులు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, శ్రీరాంనాయక్ ఉన్నారు.