హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 6 : గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వం నుంచి వరింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన ఇళ్ల స్థలాల కేటాయింపు సర్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం అందజేశారు. హౌసింగ్ సొసైటీల్లో సభ్యత్వంలేని నగర పరిధిలోని అర్హతగల వరింగ్ జర్నలిస్టులకు సొంతింటి స్థలం అందించేందుకు గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ జర్నలిస్టుల యూనియన్ల నేతల భాగస్వామ్యంతో ఏర్పడ్డ సిక్స్మెన్ కమిటీ, చేస్తున్న పనిని మంత్రి అభినందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు దృఢసంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో రెండు సొసైటీలలోలేని అర్హులైన జర్నలిస్టుల ఇళ్లస్థలాల కోసం హసన్పర్తి మండలం మడిపల్లిలో కేటాయించిన 13ఎకరాల స్థలానికి సంబంధించి సర్యూలర్ కాపీని సిక్స్మెన్ కమిటీ సభ్యులకు ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, సిక్స్మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్, కోకన్వీనర్ బొక దయాసాగర్, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసపురి సుధాకర్లు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్లను కొంతకాలంగా ఇళ్ల స్థలాలు అందించాల్సిందిగా సిక్స్మెన్ కమిటీ విజ్ఞప్తి చేయగా మంత్రి కేటీఆర్తో భూకేటాయింపు ఉత్తర్వులు తీసుకోవటం వలన ఎంతోకాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతోందని కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
త్వరలోనే సర్యులర్పై జీవో విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ను సిక్స్మెన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. వారి విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సీసీఎస్ఏతో మాట్లాడతానని చెప్పారు.
వినయ్భాస్కర్, అరూరికి కృతజ్ఞతలు..
భూమి ఇప్పించేందుకు కృషిచేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాసర్, పెద్దమనసుతో తన నియోజకవర్గ పరిధిలోని స్థలం అందించిన వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్కు సిక్స్మెన్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, రెవెన్యూ అధికారులకు, ఇందుకోసం పనిచేసిన ప్రతి ఒకరికీ ధన్యవాదాలు తెలిపారు. భూకేటాయింపునకు సంబంధించిన విషయంపై అర్హులైన వరింగ్ జర్నలిస్టులకు స్థలాలు అందించే ఏర్పాట్లపై త్వరలోనే సిక్స్మెన్ కమిటీ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుందని సిక్స్మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ ప్రకటించారు.