పాలకుర్తి రూరల్, నవంబర్ 7: బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా మంత్రులు తన్నీరు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలిని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ నాయకులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా నిర్వహించే సభకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్రావు హాజరవుతారని చెప్పారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారన్నారు. ఈ కార్య ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు ఉన్నారు.