తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. భారీ ర్యాలీలు తీసి, బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. సఫాయి కార్మికులను సన్మానించారు. రావూరు, రాయపర్తి, కడవెండిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన కడవెండి, పాలకుర్తి, చిన్నపెండ్యాల, కొడవటూరు సర్పంచ్లకు అవార్డులను అందించారు. కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని జీపీ కార్మికులను సత్కరించారు. చిట్యాల, మొగుళ్లపల్లి మండలా ల్లోని గ్రామాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
జనగామ మండలం శామీర్పేటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కలు నాటారు. మహబూబాబాద్ మండలం నడివాడలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ గ్రామస్తులతో కలిసి ర్యాలీ తీశారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు. కమలాపూర్ మండలం మర్రిపెల్లిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సఫాయి కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పర్వతగిరిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సఫాయి కార్మికులను సన్మానించారు. స్టేషన్ఘన్పూర్, వేలేరు మండలాల్లో ఎమ్మెల్యే రాజయ్య పర్యటించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు నివేదించారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 15