తొర్రూరు, నవంబర్ 28 : “దయన్నే మీ ధైర్యం… కష్టం వచ్చిందంటే క్షణంలో వాలుతా… నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేకుండా పని చేశా”..అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా తొర్రూరులో మంగళవారం ఆయన భారీ రోడ్డు షో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో రోడ్డు షో విజయవంతమైంది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కళ్ల ముందు కన్పిస్తున్న అభివృద్ధి, ఇంటింటా అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతి ఒక్కరూ దయన్నను మరిచిపోతారా..? అంటూ వేలాదిగా పోటెత్తిన గులాబీ దండును ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా వేల గొంతుకలు కారుకు ఓటేస్తాం… దయన్నను గెలిపిస్తామంటూ పెద్ద ఎత్తున నినదించారు. మూడుసార్లు తనను ఆదరించి గెలిపించిన పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. ఈ ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక, ఎరువులు లేక, మోటర్లు, స్టారర్లు కాలుతుండడంతో పైసలు లేక, గొంతు తడుపుకోవడానికి ఇంటింటికీ నీళ్లు లేక గోసపడింది మీరుకాదా..? అని అన్నారు. అలాంటి పార్టీకి మళ్లీ ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు.
రైతులు, కూలీలు బాగుంటే వ్యాపారులు బాగుంటారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బంధు, రైతు బీమా, పంటలకు కడుపునిండా కాల్వలు, చెరువుల ద్వారా నీళ్లు అందించారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఎస్సారెస్పీ కాల్వలు తవ్విస్తే బాబ్లీపై తాను పోరాటం చేసి పోలీస్ కేసుల పాలైనా పదేళ్ల కాంగ్రెస్ హయాంలో చుక్క నీళ్లు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కాల్వలు, చెరువుల్లో పుష్కలంగా నీటిని నింపుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెంటే ఉంటుందని, కేసీఆర్ వస్తే 24గంటల కరెంట్ కొనసాగుతుందన్నారు. దొంగ రేవంత్రెడ్డికి కనీస అవగాహన లేక 10హెచ్పీ మోటర్లు పెడితే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని పదేపదే చెబుతున్నారని, ఆ పార్టీని గెలిపిస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని హెచ్చరించారు. గిరిజన తండాలు, గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించామన్నారు. తొర్రూరును రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా తీర్చిదిద్ది రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టగా ప్రతి వార్డులో రూ.1.50కోట్ల విలువైన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయన్నారు.
తొర్రూరులో వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేశామని, పనులు ప్రారంభించే ముందే ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. నియోజకవర్గంలో పదివేల ఇండ్లు ఇస్తానని తన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, అప్పు చేసి ఇళ్లు కట్టుకన్న వారికి కూడా రూ.5లక్షలు ఇప్పిస్తానన్నారు. ఊరికి 100మంది యువతకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించేలా, ప్రభుత్వ కొలువులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇప్పించేలా భవిష్యత్ ప్రణాళిక రూపొందించామన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలందరికీ వరంగల్ టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండడమే నాకు ఎంజాయ్ అని చెబుతూ ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా కష్టకాలంలో, లైసెన్స్ల జారీ, నిరుద్యోగ యువతకు శిక్షణ, కుట్టుశిక్షణ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన తీరును వివరించారు. మీ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పరిధిలో ప్రస్తుతం రూ.5లక్షలు ఉన్న సేవలను రూ.15లక్షలకు పెంచబోతుందని తెలిపారు. దయాకర్రావు కారణంగానే ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గానికి పుష్కలంగా సాగునీరు వస్తోందని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉష మాట్లాడుతూ నిత్యం జనం మధ్య ఉండే దయాకర్రావు కుటుంబ సభ్యులతో కూడా గడపరని, ఆయనకు అభివృద్ధి అంటే, ప్రజల కష్టసుఖాల్లో పాల్గొనడం ఎంతో ఇష్టమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చే డబ్బులు ముఖ్యమా..? దయన్న చేసే అభివృద్ధి ముఖ్యమా..? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. దయన్న వంటి మంచి వ్యక్తి గెలిస్తే ప్రతి ఇల్లు, ప్రతి ఊరు ఎంతో బాగుపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, మండల ప్రధాన నాయకులు ఎల్ వెంకటనారాయణగౌడ్, డాక్టర్ పీ సోమేశ్వర్రావు, రామసహాయం కిశోర్రెడ్డి, ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, అనుమాండ్ల దేవేందర్రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, వైస్చైర్మన్ జినుగ సురేందర్రెడ్డితోపాటు కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి ఈ నెల 30న ఓట్ల రూ పంలో దుమ్ములేపి కారును గెలిపించాలని దయాకర్రా వు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 75వేల కోతులను పట్టించి సురక్షింతంగా అడవులకు తరలించామని, రానున్న ఐదేళ్లలో ఏ గ్రామంలో కోతుల బా ధ లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే క్రమంగా రైతు బంధును రూ.16వేలకు, పెన్షన్ను రూ.5వేలకు పెంచుతుందని, నిరుపేద మ హిళలకు నెలకు రూ.3వేల భృతి, రూ.400లకే గ్యాస్ సి లిండర్, తెల్లరేషన్కార్డుదారులకు సన్నబియ్యం, ప్రతి ఒ క్కరికీ రూ.5లక్షల వ్యక్తిగత బీమా అందిస్తుందని తెలిపా రు. తాను గెలిచిన ఆరు నెలల్లో దళిత, బీసీ, గిరిజన బం ధును అర్హులైన వారందరికీ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.