న్యూఢిల్లీ : శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గత నెలలో జరిగిన భారత్-ఎ లంక పర్యటనలో రెండో మ్యాచ్ ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి బొటనవేలికి బలమైన దెబ్బ తగిలింది.
దాంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య బృందం పర్యవేక్షణలో పునరావాసం పొందుతున్నాడు.సుదర్శన్ గాయం కొంతవరకు మెరుగైనప్పటికీ టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని అక్కడి స్పోర్ట్స్ సైన్స్ బృందం తేల్చిచెప్పింది. సాయి గైర్హాజరీలో మరో లెఫ్టాండ్ బ్యాటర్ పడిక్కల్ తుది జట్టులో మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగడం ఖాయమైంది. జట్టులో సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్, ఏపీ కుర్రాడు షేక్ రషీద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.