వర్ధన్నపేట, ఫిబ్రవరి 4: నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అన్నారు. మండలకేంద్రంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.
నియోజకవర్గంలోని పర్వతగిరి మండలంలో వైఎస్ షర్మిలా పాదయాత్ర సందర్భంగా ఎర్రబెల్లి, అరూరిపై ఆరోపణలు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి ఎర్రబెల్లి అండదండలతో ఎమ్మెల్యే రమేశ్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఎంతగానో సహకారం అందిస్తూ వారికి ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, మున్సిపల్ వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, కౌన్సిలర్లు రాజమణి, రవీందర్, రామకృష్ణ, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, ఎండీ రహీం పాల్గొన్నారు.
షర్మిలా ఖబడ్దార్..
పర్వతగిరి: వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిలా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబం అనేక అక్రమాలు చేసి గతంలో జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఈడీ అటాచ్మెంట్లకు గురైనట్లు గుర్తు చేశారు. భూ కబ్జాలకు పాల్పడింది వైఎస్ జగన్మోహన్రెడ్డి కదా అని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలకు పాల్పడింది వైఎస్ కుటుంబమేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఎమ్మెల్యే అరూరి రమేశ్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు. వారిపై విమర్శలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వర్ధన్నపేటలో వంద పడకల దవాఖాన ఉందని, జమాల్పురం, చింతనెక్కొండలో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారని గుర్తుచేశారు.
గ్రామాల అభివృద్ధికి మంత్రి సహకారం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోట్ల రూపాయల నిధులతో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్గౌడ్ అన్నారు. షర్మిలా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని విమర్శించారు. షర్మిలా పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఉన్నాయని, వాటిని అతిక్రమిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని, ఆయన కూతురు షర్మిలా తెలంగాణలో పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సర్పంచ్లు బానోత్ వెంకన్న, పంజా మహేశ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితెందర్రెడ్డి, చింతపట్ల సోమేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు సర్వర్, నాగయ్య, లకుపతి, మహ్మద్ అలీ, బూర శ్యామ్గౌడ్, బాల్య వెంకటరాజు పాల్గొన్నారు.