సీఎం కేసీఆర్ విజన్ వల్లే పల్లెలు, రాష్ర్టానికి 19 అవార్డులు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
5వ విడుత కార్యాచరణపై హనుమకొండ, వరంగల్ జిల్లాల
ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు వారి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. అందరి కృషి వల్లే రాష్ర్టానికి 19 అవార్డులు వచ్చాయని, ఇదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పారు.
సీఎం కేసీఆర్ విజన్తో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడారు. ప్రధానంగా మిషన్ భగీరథ పైపుల లీకేజీలు, కరంటు స్తంభాలు, లూజ్ కరంటు తీగలు సరిచేయాలని కోరారు.
హనుమకొండ మే 28: వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల విజయవంతం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. 5వ విడుత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం శనివారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులు, అ ధికారులు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మ న్లు జిల్లా స్థాయిలో, మేయర్ కార్పొరేషన్ పరిధి లో, మునిసిపల్ చైర్మన్లు మున్సిపాలిటీ పరిధిలో ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాగా కష్టపడి పనిచేయడం వల్ల రాష్ట్రానికి ఎన్నో అవార్డు లు వచ్చాయని తెలిపారు. ఉపాధి హామీ, ఇతర పథకాల్లో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, ఇది ముఖ్య మంత్రి విజన్ వల్లే సాధ్యమైందన్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అందరూ చిత్తశుద్ధితో విజయవంతం చేయాలన్నారు. మిషన్ భగీరథ లీకేజీలు, సమస్యలను గుర్తించి త్వరలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొంచుకోవాలన్నారు. చీఫ్విప్ దాస్యం వినయ్ భాస ర్ మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ పైపుల లీకేజీలు వెంటనే సరిచేయాలని, క్రీడా ప్రాంగణాలు ప్లాంటేషన్, లే అవుట్స్ అన్యాక్రాం తం కాకుండా చూడాలన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, మంకీ ఫుడ్కోట్స్ అందుబాటులోకి తేవాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమస్య విద్యుత్ స్తంభాల మార్పు, లూజ్ విద్యుత్ తీగలు, తాగునీటి లీకేజీలు, వర్షాకాలం లో ముంపునకు గురికాకుండా నాలాల పూడికతీత కొనసాగుతుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ మాట్లాడు తూ.. హరితహారంలో 10శాతం నిధులు కేటాయించడం జరుగుతుందని, అర్బన్, రూరల్ లాం గ్ స్పేస్లు ఏర్పాటు చేయాలన్నారు. చెత్త నుంచి డబ్బు సంపాదించడం కామన్ ప్రాక్టీస్గా చేస్తే గ్రా మ పంచాయతీలకు సంపాదన లభిస్తుందని చె ప్పారు. విద్యుత్ లూజ్ వైర్స్, తుప్పుపట్టిన స్తంభాలను తొలగించేందుకు అధికారులను ఆదేశించాలని కోరారు.
హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశం మెచ్చుకుంటున్నదని అన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖను బలోపేతం చేసి పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేస్తోందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చెట్లు పెంచడం, పరిశుభ్రత పాటిస్తున్న ట్లు తెలిపారు. రోడ్ల వెడల్పు ప్రకారం మొక్కలు రోడ్లకు కింది వైపు నాటాలన్నారు. కరంటు పోల్స్ కూడా రోడ్డు చివర ఏర్పాటు చేయాలన్నారు. డ్రె యిన్స్ లెవల్స్ సరిగా ఉండేలా చర్యలు తీసు కో వాలన్నారు. వరంగల్ తూర్పు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాలు అమల్లోకి రావాలన్నారు. వరంగల్ ఈస్ట్ లో తాగునీటి పైపుల లీకేజీల వల్ల తాగునీటి సరఫరా సమస్య ఏర్పడుతోందని, లీకేజీలను అరికట్టాలని, పట్టణాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీ ర్చిదిద్దేందుకు కృషిచేయాలన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, గోపి, అదనపు కలెక్టర్లు, అదనపు కమిషనర్, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.