నర్సంపేట, అక్టోబర్ 25: రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సంపేట ఒకటో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. ఇటీవల సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సుముఖత చూపుతూ కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్ష నేతలను విశేషంగా ఆకర్షితున్నట్లు చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని కొనియాడారు. కేసీఆర్ బీమా పథకం ప్రతి ఇంటికీ ధీమా కల్పించేలా ఉందన్నారు. అన్నపూర్ణ పథకంలో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నర్సంపేటలో కొనసాగుతున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
చెన్నారావుపేట: రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరు బీఆర్ఎస్ సర్కారు అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని పాపయ్యపేటకు చెందిన కురుమ సంఘం పెద్దలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో బీరన్నగుడి నిర్మాణానికి రూ. 50 లక్షల నిధుల మంజూరుకు కృషి చేసినందకు సంఘం పెద్దలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలంలోని అవుసులతండా, కందిగడ్డతండాకు చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ నుంచి పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. నియోజకవర్గంలో సంక్షేమంతోపాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల్లో నాయకులు, కార్యకర్తలు కాళీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తిరుగులేని ఆధిక్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తున్న పెద్ది నాయకత్వాన్ని విశ్వసిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జక్క అశోక్, సర్పంచ్లు, పార్టీ గ్రామ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, కురుమ సంఘం అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: కాంగ్రెస్ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. బోల్లోనిపల్లెలోని కాకిపడగల సామాజికవర్గానికి చెందిన 40 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నీళ్లు లేక ఒక్క పంట కష్టంగా ఉండేదన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గోదావరి జలాలను తీసుకురావడంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారని వివరించారు. నాడు ఆకలితో అలమటించిన తెలంగాణ నేడు ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదగడం గర్వించదగిన విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పార్టీ మాజీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కే కోటిలాంగాచారి పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో సాంబరాజు, రవికుమార్, భీమయ్య, సారయ్య, రాజు, మునేశ్, శ్రీనివాస్తోపాటు మరికొందరు ఉన్నారు.
దుగ్గొండి: మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జడ్పీటీసీగా పోటీ చేసిన బీసీ నేత, కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వలస రామ్మూర్తి బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఈ పరిణామంతో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతాయని, హస్తం శేణులు అయోమయంలో పడ్డారన్నారు. నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెబుతూ పెద్ది సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ వంటి స్థిర నాయకత్వం వైపు అడుగులు వేస్తున్నారని చెప్పారు. నర్సంపేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ దొంతి మాధవరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రామ్మూర్తి బీఆర్ఎస్లో చేరడంతో మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలకు నిరాశే మిగిలిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ దళం బలపడుతుందని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వరావు, క్లస్టర్ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.