ఐనవోలు, జనవరి 17: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు పవిత్ర జలాలతో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి, రేణుకా ఎల్లమ్మ ఆలయాలను సంప్రోక్షణ చేశారు. అనంతరం అర్ధప్రానవట్టం లింగానికి అన్నపూజ చేసి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించారు.
కార్యక్రమంలో ఈవో నాగేశ్వర్రావు, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు ఐనవోలు మధుకర్శర్మ, పాతర్లపాటి శ్రీనివాస్, వేద పండితులు పురుషోత్తంశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం జఫర్గఢ్ మండలం కూనూర్ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఉమామహేశ్వర ఆలయం నుంచి డోలువాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.