మహబూబాబాద్ : పోలీస్ అమరుల ఆశయ సాధనకు పాటుపడాలని మహబూబాబాద్ కలెక్టర్ కే.శశాంక, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈనెల 21 న పోలీస్ అమరవీరుల దినోత్సవం పురష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ పరిధిలోని క్రీడాకారులతో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులను జ్ఞాపకం చేసుకుంటు జ్యోతి ప్రజ్వలన చేశారు. వారు మాట్లాడుతూ…. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తిత్వం సైతం పెంపొందిస్తాయని అన్నారు.
క్రీడాకారులు క్రీడ స్ఫూర్తిని చాటాలని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పంతటి సదయ్య, ఏఆర్ డీఎస్పీ రేలా జనార్దన్ రెడ్డి, క్రీడల అధికారి అనిల్, సీఐలు వెంకటరత్నం, సుంకరి రవికుమార్, కరుణాకర్రావు, సాగర్, తిరుపతి, ఎస్సైలు బానోత్ వెంకన్న, రమాదేవి, అరుణ్కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.