మహబూబాబాద్ : ఎస్టీ రిజ్వేషన్ 10శాతానికి పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఐదు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. డెబ్బై ఏండ్లలో జరుగని పని కేవలం ఎనిదేండ్లలో జరిగింది అంటే అది సీఎం కేసీఆర్ చొరవ వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.