మహబూబాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదల జీవితాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్బిదారులకు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఈ పథకం వర్తించని వ్యాధులకు కూడా చికిత్స అందించి పేదలను ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ప్రజాకర్షక పథకాలను రూపొందించిన సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ముందుకు సాగుతున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షలు గద్దె రవి, గోగుల రాజు, మర్నేని వెంకన్న, పరిపాటి వెంకట్ రెడ్డి, నాయిని రంజిత్, సూదగని మురళి, తేళ్ల శ్రీను, పృధ్వీ రాజ్, భిక్షపతి, యసం రమేష్, బాలు, తెరాస ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.