మహబూబాబాద్ : పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ పేదలకు సంజీవనిలా మారిందన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.
దేశం నలు మూలాల నుంచి తెలంగాణకి బీజేపీ నాయకులు వచ్చి మాయ మాటలు చెప్పుతున్నారని, వారి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. సీఎం కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారని, బతుకమ్మ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
కార్యక్రమంలో..మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.డి.ఫరీద్, మర్నేని వెంకన్న ఏ.ఎం.సి. వైస్ చైర్మన్ సుదగాని మురళి, నాయిని రంజిత్, గోగుల రాజు, తేళ్ల శ్రీనివాస్, అశోక్, యాస వెంకట్ రెడ్డి, రఘు ఉన్నారు.