నర్సింహులపేట, మే 26: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ మతాల మధ్య, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జగ్గుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తతండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోపాటు మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేశామన్నా రు.
ఇప్పుడు మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్పొరేటర్కు ఎక్కువ ఎంపీకి తక్కువన్నారు. మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడితే కులాల మధ్య పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తుందని అన్నారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలు చేయలేని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకులు ఎండాకాలంలో పాఠశాలకు సెలవులు ఇచ్చిన సమయంలో విద్యార్థులు బంధువుల ఇండ్లలకు పర్యటనకు వచ్చిన విధంగా వచ్చి పోతున్నారని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీల నాయకులు, కులాలు, మతాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.