తొరూరు : తొరూరు డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీ బీవోఐ బ్యాంక్ సమీపంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్, లారీ ఢీకొన్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జాం అయింది. హైదరాబాద్ జగద్గిర్గుట్ట నుంచి నందనం, వర్ధన్నపేట మీదుగా తొరూరుకు వస్తున్న తొరూరు డిపోకు చెందిన బస్ ఖమ్మం వైపు నుంచి వరంగల్కు వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్కు కాలు విరుగగా, కండక్టర్కు గాయాలయ్యాయి.
బస్సులో ప్రయాణిస్తున్న నెల్లికుదురు మండలం ఎరబెల్లిగూడెం గ్రామానికి చెందిన కె. శ్రీనివాస్, కె. అనంత, హరిపిరాల అమర్సింగ్తండాకు చెందిన హెచ్. పద్మలకు గాయాలు కాగా వీరితో పాటు మరో ఏడుగురు ప్రయాణికులకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. డ్రైవర్, కండక్టర్తో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిపో మేనేజర్ రమేశ్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జాం కావడంతో ఎస్సై గండ్రాతి సతీశ్ ట్రాఫిక్ను క్లియర్ చేశారు.