దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 5 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు. ముసాపేట మండలం సంకలమద్ది గ్రామానికి చెందిన రమేశ్కు బొలెరో, అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన రాములు, కొత్త మణ్యం, చంద్రయ్యలకు ట్రాక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా నలుగురికి అందజేశామన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మిగతా లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. వంద శాతం రాయితీతో రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, నాయకులు పాల్గొన్నారు.