మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం జీతం చెల్లించేందుకు డీడీ రావురి రాజు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆఫీస్ వాచ్మెన్ గురుచరణ్ ద్వారా తన కార్యాలయంలో రాజు రూ. 2 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.