మహబూబాబాద్ : జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కాగా, కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులో ఉన్న వట్టి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో కేసముద్రం- గూడూరు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.