మహబూబాబాద్ : నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్ లో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సంర్భంగా ఎస్పీమాట్లాడుతూ.. యువత సమయాన్ని వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నదని , ఎవరు సమయాన్ని వృథా చేయకుండా టైం టేబుల్ ఏర్పాటు చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీలు సదయ్య, సదానందం, ఎస్.బి. ఐ సతీష్,టౌన్ సీఐ సతీష్, రూరల్ సీఐ రవి కుమార్, బయ్యారం సీఐ బాలాజీ ,డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.