మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుది. విద్యుత్ షాక్కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రం మండలం పెనుగొండ శివారు మర్రితండాలో వాంకుడోత్ బాసు, నీల దంపతుల చిన్న కుమారుడు జీవన్ చదువు మానేసి మేకలు కాస్తున్నాడు.
కాగా, వాంకుడోత్ బిచ్చా అనే రైతు తన పొలంలోకి కోతులు రాకుండా ఇనుప విద్యుత్ తీగలు ఏర్పాటు చేయగా.. మేకలు కాస్తూ వెళ్లిన జీవన్ ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జీవన్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.