ప్రచార పోరులో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బీఫాం తీసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్, డోర్నకల్ అభ్యర్థి రెడ్యానాయక్లు ప్రజల మధ్యే ఉంటున్నారు. పదేండ్ల అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తు న్నారు. చిన్నాపెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తుండగా, వారి నుంచి విశేష స్పందన వస్తున్నది. బుధవారం కేసముద్రం, ఇనుగుర్తిలో ఎమ్మెల్యే శంకర్నాయక్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు.
– మహబూబాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగా ణ)
కేసముద్రం/ఇనుగర్తి, అక్టోబర్18: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. కేస ముద్రంలో బుధవారం బూత్ కమిటీ సభ్యుల ఆ త్మీయ సమ్మేళనంలో పాల్గొనడంతో పాటు బీఆర్ ఎస్ పార్టీ ఇనుగుర్తి మండల కార్యాలయాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా శంకర్నాయక్ మా ట్లాడుతూ కాంగ్రెస్కు ఓటుస్తే ఢిల్లీకి వేసినట్లేనని అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు ఏ నిర్ణయం తీసుకోలేరని, ప్రతి చిన్న సమస్యకైనా ఢిల్లీకి పరుగులు పెట్టాలని పేర్కొన్నారు. తెలంగా ణ కోసం ఆహర్నిశలు కష్టపడేది సీఎం కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 3 గంట లు కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా.. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న బీఆర్ఎస్ కావాలా.. ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఎన్నికల సమ యంలో వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాట లు నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఒకసారి అవకాశం ఇవ్వమని చెబుతున్న కాంగ్రెస్ నాయకు లు 46 ఏండ్లు అధికారంలో ఉండి ఏమి చేశారో తెలపాలన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్ర కారం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిం చి, నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పి స్తున్నాడని తెలిపారు. దళిత బంధు, బీసీ రుణాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, దశల వారీగా అందరికీ అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజే పీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా తెలం గాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించా రు. పేదలు, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.16 వేల పంట పెట్టుబడి అందిస్తామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ పరి మితిని రూ.15 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు , గ్యాస్ రూ.400 లకే అందిస్తామని తెలిపారు. దివ్యాంగులకు నెలకు రూ. 6 వేలు, ఆసరా పింఛన్ రూ.5 వేలు అందించనున్నట్లు చెప్పారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చే యాలని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటా నని అన్నారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి బీఆ ర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజ లకు వివరించి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్రం లో మూడోసారి అధికారంలోకి తీసుకురావడాని కి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా దళిత బంధు, బీసీ బంధును పైలట్ ప్రాజెక్టు కింద ఇను గుర్తి గ్రామాన్ని ఎంపిక చేయాలని సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఎమ్మెల్యేను కోరగా, ఆయన సానుకూ లంగా స్పందించి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని చెప్పారు.
కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగా రావు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ నీలం సుహాసిని, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, సర్పంచ్లు మామిడి శోభన్, జాటోత్ అరుణ, హరిచంద్ నాయక్, బానోత్ నరేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు లు నీలం దుర్గేశ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, వైస్ ఎంపీపీ రావుల నవీన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సట్ల వెంక న్న, బీఆర్ఎస్ నాయకులు ఊకంటి యాకూబ్ రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, కముటం శ్రీనివాస్, కొండ్రెడ్డి రవీంద ర్రెడ్డి, ఘన పారపు రమేశ్, పోలె పల్లి నెహ్రూరెడ్డి, మాంకాల కట్టమల్లు, గుగులోత్ వీరునాయక్, లింగాల పిచ్చయ్య, పీఏసీఎస్ చైర్మ న్ దీకొండ వెంకన్న, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి, కసిరబోయి న విజయ్ యాదవ్, ఎంపీటీసీలు పింగిలి రజిత, మాలోత్ మంజుల, ఉపసర్పంచ్ గుండ్రపెల్లి దే వేందర్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బేత మల్ల చంద్రయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శులు గండు నాగన్న, మలిశెట్టి రవి, జాటోత్ శ్రీను, మండల సోషల్ మీడియా ఇనచార్జి దార్ల భాస్కర్, యూత్ మండల కమిటీ సభ్యులు తమ్మడపల్లి ప వన్, గ్రామ యూత్ ప్రధాన కార్యదర్శి రాజేశ్, గడ్డం శ్రీకాంత్ పాల్గొన్నారు.
కేసముద్రం మండలంలోని అమి నాపు రం గ్రామానికి చెందిన బోన గిరి సంపత్, శ్రీ కాంత్, మరికొంత మంది ఎమ్మెల్యే శంకర్నా యక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.