హనుమకొండ చౌరస్తా, జనవరి 11 : కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్’ అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు. సంబంధిత ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల మెమోలు వారి కాలేజీల నుంచి తీసుకోవాలని, రీ వాల్యుయేషన్లో బెనిఫిట్ పొందిన విద్యార్థులు నేరుగా పరీక్షల విభాగానికి వచ్చి తీసుకోవాలని సూచించారు.