కాజీపేట, ఏప్రిల్ 24: దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీన చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న విష్ణుపురికి చెందిన ములుగు దేవేంద్ర తన ఇంటిలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెల తాడును తెంపుకుని పారిపోయాడు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కాజీపేటలో అనుమానాస్పదంగా కనిపించిన యాదగిరి సురేశ్(30)ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పుస్తెల తాడును తానే అపహరించినట్లు ఒప్పుకున్నారు. నిందితుడి నుంచి సొత్తు స్వాధీన చేసుకుని, అతడిని రిమాండ్కు తరలించారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన సీఐ సార్ల రాజు, ఎస్సై ప్రమోద్ కుమార్, కానిస్టేబుళ్లు భాస్కర్, కమలాకర్ను ఏసీపీ అభినందించారు.