వర్ధన్నపేట, సెప్టెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసే పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన చెరుపెల్లి వం శానికి సంబంధించిన 50 కుటుంబాల నుంచి 150 మంది, కొత్తపల్లి, దివిటిపల్లి గ్రామాల నుంచి 100 మంది వివిధ పార్టీల కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో కూడా సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అలాగే, కొత్తగా బీఆర్ఎస్లో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నా రు. కాగా, మండలంలోని ఇల్లందలో మున్నూరుకాపు, దివిటిపల్లిలో ఎస్సీ, గౌడ, రామవరంలో మున్నూరుకాపు, బీసీ కమ్యునిటీ హాళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే ఆయా కుల సంఘాల పెద్దలకు అందజేశారు. ఒక్కో కమ్యూనిటీ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, సర్పంచ్లు మంద సతీశ్, వెంకట్రెడ్డి, బుంగ లత, ఎంపీటీసీలు ఉమాదేవి, సోమయ్య, నాయకులు ఎల్లయ్య, మధుసూదన్రెడ్డి, నవీన్ పాల్గొన్నారు.
న్యూశాయంపేట : హసన్పర్తి మండలంలోని నాగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 50 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ వారికి కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో తోట అనితా కుమార్, చిప్ప సదానందం, వినయ్, రాజయ్య, ప్రశాంత్, మొగిళి, సాంబయ్య, బుచ్చయ్య, రాజయ్య, రాధ, శైలజ, వెంకటేశ్, జ్యోతి, కవిత, సుశీల, రోజా, కళ, రాజేందర్ ఉన్నారు.
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 43వ డివిజన్ ఝాన్సీనగర్లో రూ.50 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం డివిజన్లో పలు సమస్యలను పరిశీలించారు. కార్పొరేటర్ అరుణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.