జయశంకర్ భూపాలపల్లి : రైతులు ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దని, పూర్తి స్థాయిలో ధాన్యం ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తెలిపారు. గణపురం మండలం జంగుపల్లి, బస్వరాజ్ పల్లి, ధర్మారావు పేట గ్రామాల్లో పీఏసీఎస్ సొసైటీ, మాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..రైతుల నుంచే పూర్తి స్థాయిలో ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. యాసంగి ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కావున రైతుల తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఎగుమతి చేసి మిల్లులకు పంపిస్తున్నామన్నారు.
ధాన్య సేకరణ విషయంలో సీజన్ ముందుగానే రెవెన్యూ శాఖ ,సివిల్ సప్లై, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యాసంగి ధాన్యంపై తెలంగాణ రైతులకు ఎన్నో ఆంక్షలు విధించిన్నపటికీ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల పక్షాన నిలబడుతామన్న విషయాన్ని గుర్తుచేశారు.