చిట్యాల: గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా ఏలేటిరామయ్యపల్లిలో మూడవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రాహాలకు వేద పండితులతో తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండలాని అభిషేకాలు, విగ్రహస్నానాలను చేయించారు. ఇంటిల్లిపాది ఆడపడుచుల సమక్షంలో కుంకుమ పూజలు నిర్వహించి హోమాలు చేశారు.
గ్రామస్తులు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని పాడిపంటలు, పశసంపద, ఆయురారోగ్యాలు, అష్ఠశ్వర్యాలు సిద్ధించాలని గ్రామదేవతలను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏలేటి సరోజనలింగారెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు ఏలేటి నాగరాజు, జైపాల్, కొడారి కొమురయ్య, పొలంపల్లి తిరుపతి, మర్రి రాజు, నరేష్, సహదేవ్, పెద్దిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.