జయశంకర్ భూపాలపల్లి : వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మమత దవాఖానలో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వళ్తే..భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్ కి చెందిన ప్యారి శివ (19) కు జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని మమత హాస్పిటల్ కు శివ తల్లిదండ్రులు రాజేశ్వరి, మధు తీసుకెళ్లారు.
డాక్టర్ వినోద్ కుమార్ పరీక్షలు నిర్వహించి జాండీస్ వచ్చాయని తెలిపారు. అనంతరం సోమవారం నుంచి డాక్టర్ ట్రీట్మెంట్ ప్రారంభించారు.
మంగళవారం ఉదయం మీ అబ్బాయికి సీరియస్ గా ఉందని చెప్పి జిల్లా కేంద్రంలోని స్మార్ట్ కేర్ దవాఖానకు పంపించగా స్మార్ట్ కేర్ హాస్పిటల్కు పోయేలోపే శివ మరణించాడు. శివమరణంతో శాంతినగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.