మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ, నిర్వాసితుల నుంచి వస్తున్నడిమాండ్ మేరకు సోమవారం నుంచి తాహసీల్దార్ శ్రీనివాస రెడ్డి సమక్షంలో రీసర్వే చేపట్టారు. అధునాతన సాంకేతిక పరికరాల సాయంతో డిజిటల్ పద్ధతిలో సర్వే చేస్తున్నారు. మొదటి రోజు 20 ఇండ్లను సర్వే చేసిన అధికారులు మంగళవారం నుంచి మరో 4 బృందాలతో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సర్వేయర్ ప్రభాకర్, ఆర్ఐ సరిత లు పాల్గొన్నారు.