కృష్ణకాలనీ: పోలీసులు నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. 2020 బ్యాచ్కు చెందిన 10మంది నూతన ప్రొబేషనరి రిజర్వు సబ్-ఇన్ స్పెక్టర్లు గ్రే హౌండ్స్, ఐస్డబ్ల్యూ, సీఎస్డబ్ల్యూ, ట్రాఫీక్, పీటీఓ, వంటి వివిధ విభాగాల్లో ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసుకోని సోమవారం జిల్లా అదనపు ఎస్పీ ని మార్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ఐలకు ఏఎస్పీ శ్రీనివాసులు పలు సూచనలు చేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన డిపార్టుమెంట్ అని తమ వృత్తిని నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. పోలీసులు వృత్తి పట్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలన్నారు. ఏఎస్పీని కలిసిన వారిలో ఎండీ అజారుద్దీన్, ఇ నాగరాజు, ఎన్ సందీప్, ఎండీ ఫిరోజ్, బీ శ్రావణ్, ఓ భానుప్రకాశ్, ఎన్ అశోక్, డీ రమేష్, ఏకాంబరం, వేణు, తదితరులు ఉన్నారు