కాటారం:ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ను వినియోగించుకునేలా ప్రతీ పాఠశాల దరఖాస్తులు చేసుకోవాలని ధన్వాడ జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గంట రాజబాబు అన్నారు. సోమవారం కాంప్లెక్స్ పరిధిలోని గంగారం జడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్, భూడిదపల్లి ప్రాథమిక పాఠశాల, విలాసాగర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
5నుంచి10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, 9,10వ తరగతులు చదివే బీసీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అందుతుందన్నారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు దీనిపై దృష్టి పెట్టి దరఖాస్తులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ శ్రీనివాస్, హెచ్ఎంలు మధు, సుధాకర్రెడ్డి, అరుణ, ప్రకాశ్, రమేష్ ఉన్నారు.