జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించి తన మంచి తనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గణపురం మండలం చెల్పూర్ సెంటర్లో భూపాలపల్లి నుంచి హన్మకొండకి గాజుల మహేందర్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు.
క్రమంలో హన్మకొండ నుంచి భూపాలపల్లి వస్తున్న పల్లె వెలుగు బస్ ఢీకొనడంతో మహేందర్ కాలు విరిగింది. అతని భార్య ,కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, చిట్యాల ప్రోగ్రాం ముగించుకుని భూపాలపల్లి వెళ్తున్న ఎమ్మెల్యే తన వెహికల్ ఆపి సంఘటన స్థలాన్నికి వెళ్లి క్షతగాత్రులను భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖానకు దగ్గరుండి తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు. సకాలంలో స్పందించి బాధిడికి అండగా నిలిచిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.