Auto Driver | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పేది ఒకటి ఆ తర్వాత చేసేది మరొకటి అని ఆటోడ్రైవర్లు ఫైర్ అవుతున్నారు. ఓ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ.. 50 ఏండ్ల నుంచి చూస్తున్నం. ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలే. ఎట్లా మోసం చేయాలే వాళ్లకు ఒక్కళ్లకే తెలుస్తది. వేరే వాళ్లకు తెలియదు. ఆటోడ్రైవర్లకు రూ.12 వేల రూపాయలు ఇవ్వమని నేను అడగలేదు.. నువ్వు ఇస్తా అన్నవ్. నువ్వు మా లెక్క సాధారణ మనిషివైతే మర్చిపోతాం. నువ్వు రాష్ట్రానికి సీఎం. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12 వేలు ఇస్తా అన్నవ్. ఫ్రీ బస్ పెట్టినవ్. అది మాకు శాపమైంది. అయినా కూడా మా జీవనోపాధి మేం ఎలాగోలా చూసుకుంటున్నం. ఆదాయం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అడగలేదు.
మా భార్య, పిల్లలు ఈ రోజు రోడ్డుమీదికి వచ్చినం. ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఇంత దరిద్రంగా ఆటోడ్రైవర్లను తయారు చేసినవంటే.. మొత్తం రవాణా రంగాన్ని దివాళా తీసిందంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా పరామర్శించలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకలి చావులతో ఇప్పటి వరకు వందల మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా పరామర్శించలేదన్నారు. పొన్నం ప్రభాకర్ను ఇప్పటికి నాలుగు సార్లు కలిస్తే మాటలు మాత్రమే మంచిగా చెప్తున్నాడు.. పని చేయడం లేదు. ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెడతాను అని పిలిచి పెట్టకుండా పంపడం సరికాదని మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇవ్వాలని మేము నిన్ను అడగలేదు.. నువ్వే ఇస్తాను అన్నావు
మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం దివాలా తీసింది అంటే అది రేవంత్ రెడ్డి వల్లనే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకలి చావులతో ఇప్పటి వరకు వందల మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు
కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల… pic.twitter.com/ZIf4f28SJO
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026