భూపాలపల్లి :సీనియర్ పాత్రికేయులు రాఘవులు శనివారం ఉదయం తన స్వగ్రామం భూపాలపల్లి మండలం గుర్రంపేటలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి లు మృతుని కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విలేకరి కుటుంబాన్ని ఆదుకుంటుందని, తమ సహాయ సహాకారాలు కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉంటాయని హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్, అలాగే పాత్రికేయులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.