జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కానుకగా సీఎం చీరెలు అందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. రేగొండ ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడ బిడ్డలందరికి ఒక అన్నలా, తమ్ముడిలా, తండ్రిలా మారి బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అలాగే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్య తో మన రాష్ట్ర చేనేత కార్మికులు మగ్గాలపై నేసిన చీరెలను ఆడపడుచులకు కానుకగా అందిస్తున్నారని పేర్కొన్నారు.
అదే విధంగా పెండ్లి అయిన ప్రతి నిరుపేద ఆడ బిడ్డకు మేన మామ కట్నం కింద రూ.1,00,116/- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నారని తెలిపారు.