చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర కండువ కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గొర్రె సాగర్, టీఆర్ఎస్పార్టీ మండలాధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్రెడ్డి, సర్పంచ్ దుప్పటి రజితశ్రీనివాస్, నాయకులు రఘుపతి, కాట్రేవుల కుమార్, రాజు, రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.