మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. మహదేవపూర్ రోడ్డులోని కాటారం ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర బుధవారం సాయంత్రం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.76.57 లక్షల నగదుతో పాటు శామ్సంగ్ ట్యాబ్, మెడికల్ కిట్, జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ప్రయాణించిన స్కార్పియో ( WB 94 P 4855 ) వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.