జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకరాలు పొలం వేయగా వరి పొలానికి నీళ్లు పెట్టేందుకు ఉదయం పొలానికి వెళ్లాడు. అయితే పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్ తీగను గమనించక పోవడంతో షాక్ కొట్టి చనిపోయాడు.
మృతుడికి భార్య సాంబ లక్ష్మి, ముగ్గురు కుమారులున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైంది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.