చిట్యాల: హరితహారంలో భాగంగా గ్రామాల పరిధిలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి శైలజ అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రధాన రహదారి వద్ద నాటిన మొక్కలను పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు పడిపోయి ఉండగా వాటిని లేపి ట్రీగార్డులను ఏర్పాటు చేసి ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ..మొక్కలను సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా ఏపీవో అలీంపాషా, ప్లాంటేషన్ సూపర్వైజర్ శ్రీకాంత్, టీఏ సుధాకర్, పంచాయతీకార్యదర్శి మానస తదితరులు పాల్గొన్నారు.