భూపాలపల్లి :ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అధికారులను కోరారు. బుధవారం తన కార్యాలయంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు హస్పిటల్లలో తీసుకోవాల్సిన అగ్నిప్రమాద నివారణ చర్యలపై చర్చించారు.
జిల్లాలోని ప్రైవేటు హస్పిటల్లకు హస్పిటల్లలో రెగ్యులేటరీ యాక్టు ప్రకారం అనుమతులు ఇవ్వడం, నిరంతరం పర్యవేక్షణ చేయడం, ఆసుపత్రులను తనిఖీ చేస్తూ చర్యలు చేపట్టడం మొదలైన విషయాలు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి పరిధిలో ఉంటాయని, ఇందులో కలెక్టర్, జిల్లా జడ్పిచైర్మన్లుగా ఉంటారని అన్నారు.
ఏదైనా విపత్తులు సంభవిస్తే వెంటనే నివారించే సదుపాయాలు, పరికరాలు ఉండాలని, పమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే 101 కు లేదా 8712699208 కు కాల్ చేసి సహాయం పొందాలని కోరారు. అగ్ని మున్సిపల్ పరిధిలోని ఆసుపత్రులు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రవికుమార్, డీపీహెచ్ఎన్ఓ వెంకటమ్మ, మాస్ మీడియా అధికారి అన్వర్, సీహెచ్ఓ విద్యాసాగర్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్రాజు, డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రధాన్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ విజెందర్, డాక్టర్ రవిందర్, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు.