భూపాలపల్లి: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డీడీఎంఎస్ బి. వెంకన్న అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ భూగర్భ గనిని, కేటీకే ఓసీపీ-3 ప్రాజెక్ట్ను ఆయన సందర్శించి, ఆయా గనులలో సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీడీఎంఎస్ మాట్లాడుతూ ఆయా స్థాయిల్లోని అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడూ పర్యవేక్షించి, రక్షణ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అదే సమయంలో గనిలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి స్వీయ రక్షణ పరికరాలను ధరించే విధంగా చూడడంతో పాటు, రక్షణ సూత్రాలను పాటించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది, సూపర్వైజర్లదేనని డీడీఎంఎస్ వెంకన్న స్పష్టం చేశారు.
భూపాలపల్లి ఏరియా ప్రమాదరహిత ఏరియాగా పేరుతెచ్చుకోవాలని వెంకన్న సూచించారు. ఈ సందర్భంగా డీడీఎంఎస్ వెంట తాడిచర్ల బ్లాక్-2, పీవీఎన్ఆర్ ప్రాజెక్ట్ పీవో బీవీ రమణ, ఏఎస్వో రవీందర్, కేటీకే ఓసీపీ-3 పీవో జె. రాజశేఖర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ విశ్వనాథం, ఏరియా సర్వే ఆఫీసర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.