జయశంకర్ భూపాలపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంపై ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ..ఆటోకు తాడు కట్టి అపోలో ఫార్మసీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తూ సమాన్యుల జీవితాలను బలిపెడుతుందని ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.