రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో యువకులు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పరకాల నియోజకవర్గంలోని అభ్యర్థులకు చల్లా చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని హైదరాబాద్ ఫ్యాకల్టీతో పరకాలలో 760 మందికి, గీసుగొండలో 550 మందికి ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. 70 రోజుల పాటు కొనసాగనున్న ఈ కోచింగ్లో భాగంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు సబ్జెక్ట్ల నిపుణులు కరెంట్ అఫైర్స్తో పాటు ఇతర అంశాలను బోధిస్తున్నారు. అభ్యర్థులకు ట్రస్ట్ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ కూడా అందజేస్తున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తామని యువకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పరకాల, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో చల్లా చారిటబుల్ ట్రస్ట్ యువతకు అండగా నిలుస్తోంది. 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, యువత కు అండగా నిలిచేందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. పరకాల, గీసుకొండలో ఉచిత కేంద్రాల ను ఏర్పాటు చేసి అభ్యర్థుల కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా రు. ఈనెల 18న ఎమ్మెల్యే చల్లా పట్టణంలో తరగతులను ప్రారంభించారు. శిక్షణ సమయంలో మధ్యాహ్నం ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్నాక్స్ను అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. మొత్తం 1310 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూ రు మండలాలకు చెందిన అభ్యర్థులకు పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్స్లో, గీసుగొండ, సంగెం మండలాలతో పాటు గ్రేటర్లో విలీనమైన గ్రామాల అభ్యర్థులకు గీసుగొండ మండ లం ఊకల్ గ్రామంలోని ఎస్ఎస్ గార్డెన్స్లో కోచింగ్ కేంద్రాల ను నిర్వహిస్తున్నారు. ఇటీవల మండల కేంద్రాల్లో నిర్వహించిన అర్హత పరీక్షకు 1388మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పరకాల కోచింగ్ సెంటర్లో 760 మంది, గీసుగొండ కోచింగ్ సెంటర్లో 550 మంది అభ్యర్థులు శిక్షణకు హాజరవుతున్నారు. 70రోజుల పాటు కొనసాగనున్న ఈ కోచింగ్ సెంటర్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు సబ్జెక్ట్ల నిపుణులు కరెంట్ అఫైర్స్తో పాటు ఇతర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి అభ్యర్థికీ ఉచిత స్టడీ మెటీరియల్ను అందించడతోపాటు పలు రకాల మెటీరియల్తో తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ప్రతి రోజు ఉచిత భోజనంతో పాటు స్నాక్స్ అందిస్తున్నారు. గ్రూప్స్తో పాటు పోలీసు ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ ఉచితంగా ఇస్తుండడంతో పలువురు అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరకాల నియోజకవర్గంలో చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో భాగంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే స్థితిలో లేరు. వీరికి అండగా నిలువాలనే ఉద్దేశంతో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా రెండు కోచింగ్ సెంటర్లను ప్రారంభించి, మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నా. నాణ్యమైన కోచింగ్ ఇచ్చేందుకు సీనియర్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేశా. కోచింగ్ను సద్వినియోగం చేసుకుని నియోజకవర్గంలోని యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ముందువరుసలో నిలువాలి.
– చల్లా ధర్మారెడ్డి, పరకాల ఎమ్మెల్యే