చిట్యాల : పెట్రోల్ బంకులో పెట్రోల్ తక్కువ పోస్తు, మీటర్ మాత్రం సరిగ్గా చూపిస్తు జనాలను మోసం చేస్తున్న వైనం మండల కేంద్ర శివారులోని ఇండియన్ ఆయిల్ సువర్ణ ఫిల్లింగ్ స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఓ వినియోగదారుడు తనకు 20లీటర్ల పెట్రోల్ అవసరముండగా తన వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ టిన్నులో పెట్రోల్ను పోయించుకున్నాడు. అదికాస్త 20లీటర్ల టిన్నుకు గాను 17 లీటర్ల వరకు రావడం గమణించాడు. మీటర్ బోర్డులో మాత్రం 20 లీటర్ల విక్రయించినట్లు ధరతో పాటు సమాన కొలతలు చూపెట్టింది. వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేసి టిన్నులో ఉన్న పెట్రోల్ను తిరిగి సిబ్బంది బంక్లో పోసాడు. మరల 20 లీటర్ల పెట్రోల్కు 17లీటర్లు రావడంతో వినియోగదారుడు బంక్ సిబ్బందిపై మండిపడ్డాడు.
రీడీంగ్ తిరుగుతున్న రీడింగ్కు అనుగుణంగా పెట్రోల్ రాకపోవడంతో అక్కడ ఉన్న పెట్రోల్ వినియోగదారులు గుమికూడి నిరసన తెలిపారు. వినియోగదారులను మోసం చేయడం ఏంటని, వెంటనే సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టి, బంకు యజమానిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, పెట్రోల్ వినియోగదారులు డిమాండ్ చేశారు.