మల్హార్ : మల్హార్రావు మండలంలోని తాడీచర్ల గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ను సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2,00,000 విలువ చేసే ఎల్ఓసీని మంజూరు చేయించాడు.
కాగా పుట్ట మధుకర్ వ్యక్తిగత సహయకుడు బుధవారం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్యశ్రీ దగ్గరకు వెళ్లి ఎల్ఓసీని అందజేశారు.