కొడకండ్ల : మండలంలోని లక్ష్మక్కపల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై బోడోనికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మండల కేంద్రంలోని ఎంపిడీఓ కార్యాలయంలో బుధవారంజరిగింది.
ఈ కార్యక్రమానికి జనగామ ఆర్.డి.ఓ మధుసూదన్ హజరై రైతులకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి,డి.టి దేవా, రైతులు తదితరులు పాల్గొన్నారు.