జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి తిరుపతి (25) అనే యువకుడు ఇంట్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదఘాతానికి గురయ్యాడు.
గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.